అప్సరతో ఎప్పుడూ శారీరకంగా కలవలేదు – పూజారి సాయికృష్ణ

-

రాష్ట్రంలో సంచలనం రేపిన అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ అప్సరతో శారీరకంగా కలవలేదని సాయికృష్ణ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమెకి చెన్నైకి చెందిన యువకుడితో సంబంధం ఉందని సాయి కృష్ణ పోలీసులకు తెలిపారట. అయితే తనను పెళ్లి చేసుకోవాలని అప్సర బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమెను హత్య చేసినట్లు సాయి కృష్ణ ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

ఇక అటు అప్సర మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఆమె డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే తలకు బలమైన గాయాలు కావడం వల్లే అప్సర ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు పోస్ట్ మాత్రం నివేదికను పోలీసులకు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news