టీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి మీడియాకు నో ఎంట్రీ

-

టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశానికి మీడియాను అనుమతించడం లేదు. తెలంగాణ భవన్ స్టాఫ్ తమను లోపలికి అనుమతించడం లేదని పలు మీడియా వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటే చెబుతామని అన్నారని తెలిపాయి. టీఆర్ఎస్ కార్యాలయంలో ఉన్న మీడియాను పోలీసులు బయటకు పంపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బయటకు పంపామని పార్టీ నాయకులు, పోలీసులు తెలిపారు. దీంతో మీడియా ప్రతినిధులు తెలంగాణ భవన్ బయట రోడ్డుపై ఎదురుచూస్తున్నారు.

మరోవైపు కాసేపట్లో జాతీయ పార్టీని ప్రకటించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్ కు బయలుదేరనున్నారు. ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ భేటీలో ఆ పార్టీ నాయకులతో పాటు తమిళనాడులోని వీసీకే పార్టీ నాయకులు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. ఇతర నేతలు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news