లెజెండ్స్ లీగ్ లో ఆడ‌టం లేదు : స‌చిన్ షాకింగ్

-

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న విశ్వ‌రూపాన్ని చూపిస్తుంది. దీని ప్ర‌భావం చాలా వాటిపై ప‌డుతుంది. ఇప్ప‌టికే క‌రోనా ప్ర‌భావంతో చాలా సినిమాలు, క్రికెట్ టోర్న‌మెంట్ లు వాయిదా ప‌డ్డాయి. అంతే కాకుండా ప‌లువురు సెల‌బ్రెటీలు కూడా కొన్నింటి నుంచి త‌ప్ప‌కున్నారు. అయితే తాజా గా క్రికెట్ గాడ్ టీమిండియా మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌తి ఏడాది జ‌రిగే లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో ఈ సారి స‌చిన్ టెండూల్కర్ ఆడ‌ర‌ని ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ సంస్థ అధికారికంగా ప్ర‌కటించారు.

అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుత‌న్న నేప‌థ్యంలోనే ఆయ‌న ఆడ‌టం లేద‌ని తెలిపారు. కాగ ప్ర‌తి ఏడాది అంత‌ర్జాతీయ స్థాయిలో రిటెర్మెంట్ అయిన ఆట‌గాళ్లు ఈ లీగ్ ను ఆడుతున్నారు. కాగ గ‌త ఏడాది లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో పాల్గొన్న ప‌ఠాన్ బ్ర‌ద‌ర్స్ తో పాటు యువ‌రాజ్ సింగ్ కు కూడా క‌రోనా బారీన ప‌డ్డారు. అయితే ఈ ఏడాది క‌రోనా వ్యాప్తి వేగంగా ఉండ‌టం తో స‌చిన టెండూల్క‌ర్ ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news