మేడిపల్లి సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ.. ఎందుకంటే?

-

‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కూడా భారీ ఎత్తున అల్లర్లు, నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో మేడిపల్లిలోని సాయి డిఫెన్స్ అకాడమీకి రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆర్మీకి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులను రెచ్చగొట్టారనే ఆరోపణలో రైల్వే యాక్ట్-1989 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

సాయి డిఫెన్స్ అకాడమీ
సాయి డిఫెన్స్ అకాడమీ

ఈ మేరకు ఆ నోటీసులను సాయి డిఫెన్స్ కార్యాలయం గేటుకు అతికించారు. త్వరలో విచారణ ఉంటుందని, విచారణకు సాయి డిఫెన్స్ అకాడమీ రికార్డులు, ఆధార పత్రాలతో రావాలని రైల్వే పోలీసులు సూచించారు. కాగా, ఈ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news