బాలీవుడ్​లో యంగ్ టైగర్ ఎంట్రీ.. గ్రీక్ గాడ్​తో తారక్ మల్టీస్టారర్ మూవీ

-

టాలీవుడ్ యంగ్ టైగర్.. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ వైపే ఇప్పుడు అందరి చూపు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్​ నెక్స్ట్ సినిమాలపైనే ప్రేక్షకుల ఫోకస్. అయితే ఎన్టీఆర్​కు ఉన్న క్రేజ్​ను క్యాష్ చేసుకునేందుకు బాలీవుడ్ ట్రై చేస్తోంది. ఈ నేపథ్యంలో తారక్​తో సినిమా చేసేందుకు రెడీ అయింది.

 

బాలీవుడ్​లో తారక్ ఎంట్రీ కన్​ఫర్మ్ అయింది. ఇప్పటికే సూపర్ హిట్ అయిన వార్ సినిమా సీక్వెల్​తో ఎన్టీఆర్ హిందీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇందులో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్​తో కలిసి తారక్ నటించనున్నాడట. ఈ విషయాన్ని మూవీ​ క్రిటిక్​ తరణ్​ ఆదర్శ్​ ట్విటర్​ వేదికగా తెలిపారు.

వార్​ సినిమా మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్స్​ తెరకెక్కాయి. అప్పట్లోనే ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. తాజాగా వచ్చిన అప్డేట్​ ప్రకారం ఈ సినిమాలో యంగ్ టైగర్ నటించనున్నాడట. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news