Breaking : మరోసారి మునుగోడులో పోస్టర్ల కలకలం.. ఈ సారి పేరుతో సహా

-

మునుగోడు ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికలో పోస్టర్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కాంట్రాక్ట్‌ పే లాంటి వంటి పోస్టర్‌లు వెలుగోలకి రాగా ఈ సారి ఏకంగా పోస్టర్లపై పేర్లతో సహా గోడలపై అతికించారు. ఖబడ్దార్‌ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతామని లంబాడి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా చండూరు (Chandur) మున్సిపాలిటీలో పోస్టర్లు వెలిసాయి. మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డి ద్వారా లంబాడీల ఓట్లను కొనాలని ఆ పార్టీ నాయకులు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని పోరాట సమితి విమర్శించింది. తాము అమ్ముడుపోయే వాళ్లం కాదని, బానిసలం అంతకన్నా కాదని.. లంబాడి బిడ్డలమని హెచ్చరించారు.

ఖబడ్దార్‌ బీజేపీ.. మునుగోడులో మీకు గోరీ కడతాం: లంబాడి హక్కుల పోరాట సమితి

లంబాడి హక్కుల పోరాట సమితి పేరుతో వెలసిన ఈ పోస్టర్లు మున్సిపాలిటీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. కాగా, మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా రోజుకోవిధంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. తాము గెలిస్తే రూ.3000 పెన్షన్‌ ఇస్తామన్న రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ విసురుతూ.. ఏ రాష్ట్రంలో ఎక్కువ పింఛన్‌ ఇస్తున్నారని పేర్కొంటూ గురువారం చండూరులో వాల్‌పోస్టర్లు అంటించారు. అదేవిధంగా నేడే చూడండి.. షా సమర్పించు.. 18000 కోట్లు అంటూ రాజగోపాల్‌ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయాడని తెలిపేలా పోస్టర్లు వెలుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news