బోనాలలో పోతరాజుపై జరిగిన దాడి విషయంలో ఓవర్గం ఆందోళన.. భారీగా మోహరించిన పోలీసులు

-

తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాదులోని పాతబస్తీలో లాల్ దర్వాజా లో కూడా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం ఉన్నట్టుండి బోనాల ఉత్సవంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. లాల్ దర్వాజాలో సింహవాహిని అమ్మవారి ఆలయ సమీపంలో ఓ బృందంపై కొందరు ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోతురాజు రవీందర్ కు ఎడమ కంటి వద్ద గాయమై తీవ్ర రక్తస్రావం అయింది.

అయితే పాత గొడవలే ఈ దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితి అదుపు చేశారు. అయితే నేడు లాల్ దర్వాజా మేకల బండ వద్ద మరోసారి గొడవ చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. నిన్న పోతురాజు పై జరిగిన దాడి విషయంలో ఓ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో ఇరు వర్గాలకు పోలీసులు నచ్చ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news