రికార్డులను బ్రేక్ చేస్తున్న పఠాన్.. సీక్వెల్ ఉంటుందా..?

-

సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం అందుకుందంటే ఆ సినిమా ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే బాహుబలి, కే జి ఎఫ్ చిత్రాలు నిరూపించబడ్డాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలు సాధించిన రికార్డులను బ్రేక్ చేస్తూ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా రికార్డుల ముందు బాహుబలి 2 , కేజీఎఫ్ 2 చిత్రాలు కూడా డీలా పడిపోయాయి అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో జాన్ అబ్రహం విలన్ గా.. షారుక్ ఖాన్ హీరోగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే రూ.542 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ళను సొంతం చేసుకుని అత్యంత వేగంగా రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా భారీ విజయం సాధించడంతో అభిమానులు సీక్వెల్ గురించి చర్చిస్తున్నారు. ఇదే విషయంపై సినిమా డైరెక్టర్ స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ..”ప్రతి ఫిలిం మేకర్ లాగే నేను కూడా షారుఖ్ ఖాన్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్నాను. పఠాన్ తో ఆ కోరిక తీరిపోయింది. షారుక్ కు అద్భుతమైన కానుక ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది . ఈ సినిమా హిట్ అయింది. మరి సీక్వెల్ ఉంటుందో లేదో .. ఏం జరుగుతుందో చూడాలి..” అంటూ ఈ సీక్వెల్ గురించి మాట్లాడుతూ సిద్దార్థ్ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news