జగన్‌.. అవినీతి చేశారంటూ విషపురాతలు రాయిస్తున్నాడు : పట్టాభిరామ్‌

-

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరోసారి ఏపీ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి 64 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాల పనితీరుని చూసి, సంతోషంగా ఉంటున్న యువతను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని విమర్శించారు పట్టాభిరామ్. తన జేబు సంస్థ సీఐడీని విచారణ పేరుతో కొందరిపైకి ఉసిగొల్పి, తన పకోడి పేపర్లో చంద్రబాబు, లోకేశ్ లు రూ.241కోట్ల అవినీతి చేశారంటూ విషపురాతలు రాయిస్తున్నాడని పట్టాభి ఆగ్రహం వ్యక్తంచేశారు పట్టాభిరామ్. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పారు. వాటిలో భాగంగా 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్ర్రాలు, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ కేంద్రాలను రాష్ట్రంలోని ప్రముఖ విద్యాలయాల్లో ఏర్పాటు చేశారు.

TDP Senior Leaders Fires On Pattabhiram - Sakshi

స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేశాక, వాటిని గాలికి వదిలేయకుండా నాటి టీడీపీ ప్రభుత్వం 64 వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించింది. స్కిల్ డెవలప్ కేంద్రాలద్వారా 2 లక్షల పైచిలుకు యువత, వారి కుటుంబాలు బాగుపడటం జగన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ క్రమంలో పనిగట్టుకొని మరీ, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలపేరుతో అవినీతికి పాల్పడ్డారంటూ పసలేని ఆరోపణలకు తెరలేపాడు. ఎవరు సంతోషంగా ఉన్నా, ఏ కుటుంబం పచ్చగా ఉన్నా చూసి ఓర్వలేని జగన్ రెడ్డి, తన బులుగు మీడియా ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని విషపురాతలు రాయించాడు’ అని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news