ఇసుక తవ్వకాల అంశంపై ధ్వజమెత్తిన టీడీపీ నేత పట్టాభిరామ్

-

ఇసుక తవ్వకాల అంశంపై వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థ ముసుగులో బినామీలను సబ్ కాంట్రాకర్లుగా పెట్టి జగన్ రెడ్డి సాగిస్తున్న ఇసుక దోపిడీ సదరు సంస్థ క్వార్టర్లీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఆధారంగా బట్టబయలైందని అన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలతో తమకేం సంబంధం లేదని, ఊరూ పేరు లేని మరో పార్టీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చామని, ఈ విషయం ఏపీ ప్రభుత్వానికి కూడా తెలుసంటున్న జేపీ వెంచర్స్ సంస్థ రిపోర్టులపై ఇసుకాసురుడు జగన్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

ఇంకా ఎవరిని మోసగించడానికి ప్రభుత్వం జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ పేరుతో ఇసుకతవ్వకాలకు సంబంధించి దొంగ బిల్లులు ఇస్తోంది?తక్షణమే ప్రభుత్వం వద్ద ఉన్న ఇసుక సబ్ కాంట్రాక్టర్ల వివరాలన్నీ ప్రజల ముందు ఉంచాలి ఊరూపేరు లేని సబ్ కాంట్రాక్టర్ ఎవరు.. ఆ పేరుతో జగన్ ఇసుక మాఫియా ఈ నాలుగేళ్లలో ఎన్ని రీచ్‌లలో ఎంతెంత ఇసుక తవ్వింది? రాష్ట్రంలోని సహజవనరులన్నింటినీ మింగేస్తున్న జగన్ కేవలం ఇసుకద్వారానే రూ.40వేలకోట్లు దోచేశాడన్నది పచ్చి నిజం. రాష్ట్రంలోని ఇసుకను ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటూ, సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో దోపిడీ చేస్తున్నాడు కాబట్టే ఇసుకాసురుడు జగన్ , టీడీపీ అధినేత ప్రశ్నలపై నోరు విప్పడంలేదు’’ అని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version