చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీ కుదిరింది: మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

-

చంద్రబాబు అజెండాతోనే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరని అన్నారు. రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దని పవన్.. చంద్రబాబులకు సూచిస్తున్నామన్నారు. పదవ తరగతి ఫెయిల్ అయిన లోకేష్.. ఫెయిల్ అయిన వారితో జూమ్ కాన్ఫరెన్స్ పెట్టడం హాస్యాస్పదమన్నారు.

వ్యవసాయానికి సంబంధించి నటుడు పవన్.. మహానటుడు చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రంలో క్రాఫ్ హాలిడే లేదని అన్నారు. వ్యవసాయం గురించి ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ చంద్రబాబుతో వన్ సైడ్ లవ్ లో ఉన్నారని అన్నారు. చంద్రబాబుతో పవన్ కు ప్యాకేజీ కుదిరిందని.. అందుకే ఆయన తరఫున మాట్లాడుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news