షాకింగ్ న్యూస్: పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెండు రోజులు బ్రేక్…

-

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పార్టీలలో జనసేన కూడా ఒకటి అని తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి వారాహి యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. నిన్న మల్కిపురంలో ప్రసంగించిన అనంతరం పవన్ కళ్యాణ్ కు స్వల్పంగా జ్వరం వచ్చినట్లు తెలిసి.. ఈ రోజు ఉదయం వారాహి యాత్రకు వెళ్లకుండా పెదమీరం లో ఒక ఫంక్షన్ హాల్ లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి పవన్ ను పరీక్షించగా జ్వరంగా ఉందని.. రెండు రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చారట. దీనితో రానున్న రెండు రోజులు వారాహి యాత్రను నిలిపి వేశారు. దీనితో పవన్ అభిమానులకు షాక్ తగిలింది అని చెప్పాలి. కాగా పవన్ అభిమానులు కొందరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం ముఖ్యం అని ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోండని చెబుతున్నారు.

మరి పవన్ త్వరగా కోలుకుని వారాహి యాత్రకు సిద్ధం కావాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news