వైసీపీ నేతల పిచ్చి విమర్శలు పట్టించుకోబోను : పవన్‌

-

వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలులో వారాహి విజయ యాత్రలో ఆయన మాట్లాడారు. ఈ యాత్రలో జనసేన నేత నాగబాబు కూడా పాల్గొన్నారు. తమపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ నేతల మాటలకు తాను చేతలలో బదులిస్తానని తెలిపారు. చింతిస్తున్నాము అని వారితోనే చెప్పిస్తానని సవాలు విసిరారు.

ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నామని, అందుకోసమే జనవాణి కార్యక్రమం తీసుకువచ్చామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇవాళ జనవాణి కార్యక్రమంలో 32 అర్జీలు స్వీకరించామని తెలిపారు. ప్రజలు చైతన్యంగా లేకపోతే అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు. అరాచకాలకు జనవాణి కార్యక్రమంతో అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. వివిధ సమస్యలపై తమకు అందిన పిటిషన్లను పరిష్కారం కోసం ఆయా విభాగాలకు పంపుతామని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో మార్పు తెచ్చేలా వారాహి యాత్ర ఉంటుందని పవన్ వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version