ఇప్పుడు ఒక్క క్లిక్ తో చిన్న లావాదేవీలు: పేటీఎం

-

ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫెస్ (యూపీఐ) సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తాల్లో చెల్లింపులు చేసేందుకు గానూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) భాగస్వామ్యంతో యూపీఐ లైట్ (UPI LITE) సేవలను ప్రారంభించింది పేటీఎం. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి బ్యాంక్ తమ దేనని పేటీఎం బ్యాంక్ వెల్లడించింది. ఈ సదుపాయం ద్వారా చిన్న చిన్న లావాదేవీలను ఒక్క క్లిక్‌తో చేసేయొచ్చని చెప్పింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ లైట్ వ్యాలెట్‌లో చిన్న మొత్తాల చెల్లింపులు చేయొచ్చు.

ఒక్కసారి గరిష్టంగా రూ.200 వరకు ఇన్‌స్టాంట్‌గా పంపించవచ్చు. ఈ యూపీఐ వ్యాలెట్‌లో గరిష్ఠంగా రూ.2,000 వరకు యాడ్ చేసుకోవచ్చు. రోజులో రెండు సార్లు మాత్రమే యాడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అంటే రోజులో గరిష్ఠంగా రూ.4000 వరకు పేమెంట్స్ చేయవచ్చని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. ‘పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై యూపీఐ లైట్ ను లాంఛే చేసినందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. యూపీఐ లైట్ ద్వారా వినియోగదారులు వేగంగా, సురక్షితంగా, నిరంతరాయ చిన్న మొత్తాల ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. రూ.200 లోపు ఉండే లావాదేవీలను వారి కోర్ బ్యాంక్‌తో సంబంధం లేకుండా 50 శాతం వరకు ట్రాన్సాక్షన్లు పూర్తి చేయవచ్చు. ఇది లావాదేవీల సక్సెస్ రేటును పెంచుతుంది. యూపీఐ ప్లాట్ ఫామ్ ద్వారా రోజుకు బిలియన్ ట్రాన్సాక్షన్ల ప్రక్రియను మరింత పెంచుతుంది ‘ అని ఎన్‌పీసీఐ సీఓఓ ప్రవీణ్ రాయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news