మోటార్లకు మీటర్లు పెడితే.. విద్యుత్‌ ఆదా అవుతుంది – మంత్రి పెద్దిరెడ్డి

-

మోటార్లకు మీటర్లు పెట్టడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టడం తో విద్యుత్తు ఆదా అవుతుందని…అలాగే రైతులకు కూడా మేలు జరుగుతుందని వెల్లడించారు. ఇవాళ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రతి విషయం రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఖర్చుతో మీటర్లు బిగిస్తుంటే లేని ఆపద్దాన్ని ప్రతిపక్షాలు పదేపదే చెబుతున్నాయని వెల్లడించారు.

వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని.. శ్రీలంక తో పొలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక్కడ సీఎం, మంత్రులు ప్రజలకోసం పని చేస్తున్నారని.. 2014 ఎన్నికలు చంద్రబాబు కి చివరివి అవుతాయని చెప్పారు. బాబు హైదరాబాద్ కే పరిమితం అవుతారని తెలిపారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news