పది పాస్ కాని వారంతా పవన్ కళ్యాణ్ సంఘమే: పేర్ని నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పదవ తరగతి ఫలితాల పై పవన్ కళ్యాణ్ తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్నినాని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పదవ తరగతి ఫెయిల్ అయ్యారని.. అందుకే ఆయన ఫెయిల్ అయిన విద్యార్థులు అంటే అభిమానం చూపిస్తున్నారని.. పాస్ కానీ వారందరినీ తన సంఘమే అనుకుంటున్నాడు అని ఎద్దేవా చేశారు. చదువుకుంటే ఎవరైనా పాసవుతారు అనే విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు.

పదో తరగతి పరీక్ష పేపర్లు తయారుచేసింది..దిద్దింది టీచర్లేనని.. వైసిపి నాయకులు కాదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గ్రహించాలని పేర్నినాని హితవుపలికారు. మరోవైపు చంద్రబాబు, లోకేష్ ల పైన పేర్ని నాని ఆరోపణలు చేశారు. మహానాడు వేదికగా ముసలి సరుకును వదిలించుకుంటామని లోకేష్ చెప్పారని.. అందుకే బండారు సత్యనారాయణ మూర్తి కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పువ్వు వాసన చూడడానికి పనికి వస్తుందో రాదో ప్రజల్లో తిరిగే వారికే తెలుస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version