తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయి – ప్రధాని మోడీ

-

తెలంగాణలో కమలం వికసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని దేశ ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే, హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.

షెడ్యూల్‌ కంటే ముందే…బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం బేగంపేట సభలో మాట్లాడారు మోడీ. తెలంగాణ పేరు చెప్పి.. ప్రజలను కొందరు మోసం చేస్తున్నారని.. అలాగే, పదవులు పొందుతున్నారని ఆగ్రహించారు. కానీ.. బీజేపీ నాయకులు ఇక్కడి నాయకులను బలంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.

మొదట్లో బీజేపీకి రెండు ఎంపీ సీట్లు వస్తే అందులో ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారు. మూఢ నమ్మకాల విషయంలో తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది.. ఎవరు మంత్రి వర్గంలో ఉండాలి? ఎవరిని తీసివేయాలి? ఏ ఆఫీసులో ఉండాలి అనేది మూఢ నమ్మకాల పేరుతో చేస్తున్నారన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news