స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై బ్యాంకుల ఫిర్యాదు.. రెండు కేసులు నమోదు

-

హైదరాబాద్: ప్రముఖ స్టాక్​ బ్రోకింగ్​ సంస్థ కార్వీపై సీసీఎస్‌లో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నోలీసులు జారీ చేశారు. రుణాలు తిరిగి చెల్లించలేదంటూ పలు ప్రైవేటు బ్యాంకులు హైదరాబాద్​ సీసీఎస్​ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని కార్వీపై ఆరోపించాయి. రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్​డీఎఫ్​సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కార్వీ సంస్థ రూ. 460 కోట్ల పైగా రుణాలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లించడం లేదని తెలిపారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో రూ.329 కోట్లు, ఇండస్ ఇండ్​ బ్యాంకులో రూ. 137 కోట్లు తీసుకుని కార్వీ బకాయి పడింది. 2019లో కార్వీ సంస్థపై ఫిర్యాదు రావడంతో కార్వీ లావాదేవీలు‌పై సెబీ విచారణ జరిపి నిషేధం విధించింది. వినియోగదారులకు చెందిన షేర్లను కార్వీ సంస్థ సొంత అవసరాలకు వాడుకున్నట్లు తెలుస్తోంది. కార్వీ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news