అన్నదాతలకు గుడ్ న్యూస్.. రూ.4 వేలు పొందే అవకాశం..!

-

రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.4 వేలు పొందే అవకాశాన్ని వారి కోసం కల్పిస్తోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాల లోకి వెళితే.. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఈ డబ్బులను బ్యాంక్ ఖాతాలోకి పొందొచ్చు. ఈ లాభం అందరికీ ఉండదు అని గమనించండి.

 

ఇంకా ఈ పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరకపోయి ఉంటేనే ఈ ప్రయోజనం పొందడానికి వీలవుతుంది. రైతులకు 8వ విడత కిసాన్ డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ కేంద్రం ఈ మధ్యనే ఇచ్చింది. మీరు ఇంకా ఈ స్కీమ్ లో చేరకపోయి ఉంటే చేరచ్చు.

ఈ స్కీమ్ లో ఇప్పటికే 9 కోట్ల మందికి పైగా రైతులు చేరి.. ఈ ప్రయోజనాలని పొందుతున్నారు. ఏడాదికి రూ.6 వేలు లభిస్తున్నాయి. ఇవి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున వారి ఖాతాల్లో పడనున్నాయి.

జూన్ 30 లోపు పీఎం కిసాన్ స్కీమ్‌లో కనుక రైతులు చేరారు అంటే ఏప్రిల్ జూలై విడత డబ్బులు రైతులకు వెంటనే అందుతాయి. అలాగే తర్వాతి ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగస్ట్ లో పడతాయి. ఇలా రైతుల ఎకౌంట్ లో రూ.4 వేలు పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news