గుజరాత్‌లో మత ఘర్షణలు.. భారీగా మోహరించిన పోలీసులు

-

గుజరాత్‌లో మత ఘర్షణలు చెలరేగాయి. కచ్ జిల్లా భుజ్ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యతో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భుజ్ మాదాపూర్‌లో పాల వ్యాపారం చేసే ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. దీంతో కొందరు వ్యక్తులు వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఈ క్రమంలో పలు దుకాణాలు, ఓ మసీదు ధ్వంసం అయింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మత ఘర్షణలు
మత ఘర్షణలు

భారీగా పోలీసులు మోహరించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ మేరకు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, గుజరాత్‌లో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. 2001లో భూకంపంలో మరణించిన బాధితులకు నివాళిగా భుజ్‌లో 470 ఎకరాల్లో స్మృతి వన్‌ను మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో మత ఘర్షణలు తలెత్తడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news