మోడీ క‌నుస‌న్న‌ల్లో ఎన్నిక‌ల సంఘం: సిపిఐ రామ‌కృష్ణ‌

-

విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకే పని చేయటం దారుణమని, రాజస్థాన్‌లో సీఎం హామీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ను వాయిదా వేయించ‌టంలో ఆంతర్యమేమిటని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె. రామ‌కృష్ణ ప్రశ్నించారు.తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన భాష మార్చుకోవాలన్నారు. విజయవాడలోని దాసరి భవన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎంగా దళితుడిని నియమిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌.. తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేశారని విమర్శించారు. ఏపీలో పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నది కేవలం వైకాపా ఎమ్మెల్యేలు మాత్రమేనని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news