మంత్రివ‌ర్గ స‌మావేశం వాయిదా

-

andhra pradesh cabinet Meeting postpone

అమరావతి: బుధ‌వారం మ‌ధ్యాహ్నం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మంగళవారం అమెరికాలోని అలస్కాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి మృతిచెందారు. టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్న మూర్తి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు జరగాల్సిన సమన్వయ క‌మిటీ సమావేశంలో మూర్తి చిత్రపటానికి సీఎం సహా మంత్రులు, టిడిపి ముఖ్యనేతలు నివాళులర్పించారు. మూర్తికి సంతాపం తర్వాత ఆ సమావేశాన్ని చంద్రబాబు వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news