మంత్రి పదవికి ఎప్పుడూ పాకులాడ లేదు….నేను వైఎస్ కుటుంబానికి విధేయుడిని: బాలినేని శ్రీనివాస్ రెడ్డి

-

మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తానని ఓ పత్రికలో వచ్చినప్పుడు ఖండించానని… మేం వైఎస్సార్సీపీ పార్టీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి, జగన్ కు విధేయులం అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం జరుగుతుందని… జగన్ మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగేళ్ల మంత్రి పదవిని వదిలిపెట్టి వచ్చానని…. మంత్రి పదవి కోసం పాకులాడింది లేదని బాలినేని అన్నారు. ముఖ్యమంత్రి 25 మంది మంత్రులను తీసివేస్తాం అని అన్నప్పుడు కూడా ముందుగా స్టేట్ మెంట్ ఇచ్చింది నేనే అని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినప్పుడు కొద్దిగా ఫీల్ ఉంటుందని… ఈ అంశంపై రకరకాలుగా పేపర్లలో రాయడం కరెక్ట్ కాదని అన్నారు. మేము ఎప్పుడూ కూడా వైఎస్ ఫ్యామిలీ విధేయులమే అని… గతంలో కన్నా మాజిల్లాలో ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నిస్తాం అని ఆయన అన్నారు. ఆదిమూలపు సురేష్ తో మాకు ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. జిల్లాలో చేసిన రాజీనామాలను విరమించుకుంటాం అని అన్నారు. ముఖ్యమంత్రిగారి ఇష్టం మేరకు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటానని బాలినేని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ,బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news