విజయసాయి రెడ్డికి బుద్ధా వెంకన్న కౌంటర్..!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. ఈ నేత 13 న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బీజేపీ నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ రహస్యంగా భేటీ అయ్యారు. దీనికు సంబంధించిన వీడియోలు ఇప్పుడు తెగ హాల్ చల్ చేస్తున్నాయి.

కాగా, దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, ‘పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం. దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైంలో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు? మరిన్ని వివరాలు అతి త్వరలో…’ అంటూ ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, విజయసాయికి  కౌంటర్ ఇచ్చారు. ‘శ‌కుని మామా… నీ అల్లుడు జగన్ స్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్ర‌యోగించి తొల‌గించిన ఎస్ఈసీని చేర్చుకోవాల‌ని కోర్టు ఆదేశించినా ప‌ట్టించుకోకుండా ఉన్నారు. ఇప్పుడాయ‌న ఎవ‌రితో క‌లిస్తే నీకేంటి? క‌ల‌లోనూ క‌మ్మ‌నైన క‌ల‌వ‌రింతే! క‌మ‌లం అనే ప‌దం ప‌ల‌కాల‌న్నా వ‌ణుకెందుకో? ఢిల్లీ బాస్ అనే దమ్ము లేదా?’ అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news