ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిసిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి

-

ఢిల్లీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఈక్రమంలోనే పలువురు జాతీయ నాయకులు సీఎం కేసీఆర్ ను కలువనున్నట్లు తెలుస్తోంది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లో భాగంగా కేసీఆర్ ఎన్డీయేతరు నాయకులను వరసగా కలుస్తున్నారు. ఇప్పటికే ఇటీవల మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధిానేత శరద్ పవార్ ను కలిశారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో టచ్ లో ఉన్నారు కేసీఆర్. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీకిి వెళ్లిన కేసీఆర్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కలువనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ ని కలిసేందుకు జాతీయ నాయకులు క్యూ కడుతున్నారు. ఈరోజు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కేసీఆర్ ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాల గురించి ఇద్దరు నేతలు చర్చించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version