కారులో రెడ్డి మంత్రుల కష్టాలు..?

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కులాల పరంగా రాజకీయం జరిగేది ఏపీలో ఎక్కువ అనే సంగతి తెలిసిందే…తెలంగాణలో కులాల పరంగా పెద్దగా క్యాస్ట్ పాలిటిక్స్ ఉండవనే పరిస్తితి….కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కూడా కులాల ఆధారంగా రాజకీయం నడవటం పెరిగింది..క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టే కేసీఆర్ కూడా రాజకీయం చేస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సామాజికవర్గ ప్రభావం కాస్త ఎక్కువనే సంగతి తెలిసిందే…రెడ్లు ఎక్కువగా కాంగ్రెస్ కు సపోర్ట్ గా ఉంటూ వచ్చేవారు. ఇక వారిని ఆకట్టుకోవడానికి కేసీఆర్ అనేక రకాల ఎత్తులతో ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు.

అలాగే క్యాబినెట్ లో రెడ్లకు ప్రాధాన్యత ఎక్కువే ఇచ్చారు. ఏకంగా ఆరుగురు రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి…చివరికి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డిని సైతం మంత్రివర్గంలో తీసుకున్నారు. ఏదైనా గాని ఆరుగురు రెడ్లు మంత్రులుగా ఉన్నారు. ఇలా రెడ్లకు ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చి…రెడ్లని దగర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే అన్నివేళలా రాజకీయం సక్సెస్ అవ్వాలంటే కష్టం..ఇప్పటివరకు రెడ్లని ఆకర్షించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు గాని…ఈ సారి మాత్రం ఆయన సక్సెస్ అయ్యేలా లేరు. రెడ్లు ఈ సారి కారు పార్టీ వైపు చూసేలా లేరు…అదే సమయంలో రెడ్డి మంత్రులకు నెక్స్ట్ గెలుపు అవకాశాలు కూడా అంతంత మాత్రమే అన్నట్లు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన పలు సర్వేల్లో…సబితా, ఇంద్రకరణ్, నిరంజన్ లపై నెగిటివ్ ఎక్కువగా ఉందని తేలింది.

ఈ సారి మహేశ్వరంలో సబితాకు గెలుపు అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి…అటు నిర్మల్ లోఇంద్రకరణ్, వనపర్తిలో నిరంజన్ రెడ్డిల పరిస్తితి కూడా ఇబ్బందికరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అలా అని జగదీశ్, ప్రశాంత్, మల్లారెడ్డి పరిస్తితి మరీ అంత గొప్పగా ఏమి లేదని చెప్పొచ్చు. మొత్తానికైతే టీఆర్ఎస్ లో ఆరుగురు రెడ్డి మంత్రులకు కష్టాలు ఎక్కువగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news