బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదు – కల్వకుంట్ల కవిత

-

తప్పు చేసిన వాళ్లే భయపడతారని, బిఎల్ సంతోష్ విచారణకు ఎందుకు రావడం లేదో తెలియడం లేదని అన్నారు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మేము విచారణకు హాజరు కావాలి కానీ బిజెపి వాళ్లు రారా? అని ప్రశ్నించారు. మన దగ్గర దొరికితే విచారణ చేయొద్దా? అన్నారు. అసలు నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదని కవిత వ్యాఖ్యానించారు.

మన మంత్రులు ఈడీ, ఐటీ పిలిస్తే పోతున్నారని.. మరి బిజెపి నేతలు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని.. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే కోర్టుకెళ్లారని ఆరోపించారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడం లేదన్నారు.

నిన్న సభ పెట్టి బండి సంజయ్ ఏడ్చాడని..తప్పు చేయకపోతే భయమెందుకు? అని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తామన్నారు కల్వకుంట్ల కవిత. రాజకీయంగా గట్టిగా ఉన్నవాళ్లను గద్దల్లా ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news