బ్రేకింగ్: దిశా ఎన్కౌంటర్ పై కేసీఆర్ పరోక్ష కామెంట్స్

-

తెలంగాణాలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏ రేంజ్ లో హీట్ పెంచుతున్నాయో అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో సిఎం కేసీఆర్ మేనిఫెస్టో ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తే ఏం చేసామో అందరూ చూసారు అంటూ దిశా ఘటనపై ఆయన పరోక్ష కామెంట్స్ చేసారు. ఔటర్ రింగ్ రోడ్ కి అవతల రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

వరదలు అన్ని నగరాల్లో వచ్చినా సరే ఏ నగరంలో కూడా వరద సాయం 10 వేలు ఇవ్వలేదు అన్నారు. సీనియర్ సిటిజన్ లకు ఉచితంగా బస్ పాస్ లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. తాను 50 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా అని సిఎం కేసీఆర్ అన్నారు. జీరో కార్బన్ సిటీ గా హైదరాబాద్ ని మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో తాగునీటి కొరత అసలు లేదని సిఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news