బండి సంజయ్ మార్పు..కిషన్ రెడ్డి సంచలనం.. టీం రెడీ!

-

తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దించి..తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. అటు కేంద్రం పెద్దలు రాష్ట్ర నేతలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్న బండి సంజయ్..ఏ స్థాయిలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారో తెలిసిందే.

బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే..తెలంగాణలో బీజేపీ అంచలంచెలుగా బలపడుతూ వచ్చింది. ఇటు బండి పాదయాత్ర చేయడం, అటు కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇలా దూకుడుగా వెళుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై చర్చలు నడుస్తున్నాయి. ఈ ఏడాదిలో బండి అధ్యక్ష పదవీకాలం ముగుస్తుంది. అయితే బండిని అధ్యక్షుడుగా కొనసాగించాలనే బీజేపీ అధిష్టానం సైతం డిసైడ్ అయింది. బండి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లనున్నారు. అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు.

ఇదే విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రస్తుతం ఉన్న టీంతోనే ఎన్నికలకు వెళ్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ధైర్యంగా ఎదురుకుంటామని, బీజేపీకి నాయకత్వ సమస్యలు లేవని, ప్రజలే బీజేపీకి అభ్యర్ధులని ఇస్తారని చెప్పుకొచ్చారు.

మొత్తానికి బండి సంజయ్ నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్లనుంది..అయినా బండి మార్పుని ఎవరు కోరుకోవడం లేదు..బీజేపీ శ్రేణులు బండి నాయకత్వంలో దూకుడుగానే పనిచేస్తున్నాయని చెప్పవచ్చు. మరి బండి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news