చంద్రబాబు ఒక ఫేక్, కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొడాలి నానీ సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత కుప్పం పారిపోయారని, ఎవరు పారిపోయారో అందరికి తెలుసు అని ఆయన అన్నారు. హైదరాబాద్ లో ఓటుకు నోటు కేసు దెబ్బకు పారిపోయి వచ్చారని అన్నారు. కరోనా రాగానే చంద్రబాబు నాయుడు కాల్వ గట్టు వదిలి పారిపోయారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఒక ఫేక్ ప్రతిపక్ష నేత అని, ఒక గాలి చంద్రబాబు అని ఆయన విమర్శలు చేసారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికి అయినా సరే చేసిన తప్పులు సరి చేసుకోవాలని కొడాలి నానీ సూచనలు చేసారు. అయితే కొడాలి నానీ వ్యాఖ్యలపై సభలో తీవ్ర నిరసన రేగింది. కొడాలి నానీ ఒక మంత్రిగా మాట్లాడటం లేదని టీడీపీ నేతలు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news