జ‌న‌సేన‌లో చేరుతున్న నాదేండ్ల మ‌నోహ‌ర్‌

-

  • శుక్ర‌వారం తిరుప‌తిలో ప‌వ‌న్‌తో క‌లిసి ద‌ర్శ‌నం
  • అనంత‌రం అధికారిక ప్ర‌క‌ట‌న‌

Nadendla Manohar joins JanaSena Party

అమ‌రావ‌తి: మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీకి ఆయన గురువారం రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం మనోహర్ శంషాబాద్ నుంచి విమానంలో తిరుమలకు వెళ్లారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సైతం గురువారం రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. శుక్ర‌వారం ఉదయం వారిద్దరూ కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం జనసేనలో చేరుతున్న విషయాన్ని నాదెండ్ల మనోహర్‌ అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్న మనోహర్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా షాకేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఇప్పటివరకు జనసేనలో ఇతర పార్టీల నుంచి కీలక నేతలెవరూ చేరలేదు. మనోహర్‌ రాకతో ఆ పార్టీ కేడర్‌లో మరింత ఉత్సాహం నెలకొంటుందని భావిస్తున్నారు.2014లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పార్టీని వీడినప్పటికీ మనోహర్ మాత్రం ఇప్పటివరకూ అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి రెండు సార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన… 2011లో అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో స్పీకర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news