తన ఓటమిపై స్పందించిన నారా లోకేశ్.. ఏమన్నారంటే?

-

ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే.. నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం.

ఏపీలో వైఎస్సార్సీపీ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో పాటు.. మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ కూడా ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ ఘోర పరాజయం, తన పరాజయంపై ఎట్టకేలకు నారా లోకేశ్ స్పందించారు.

nara lokesh responds over tdp defeat

వరుస ట్వీట్లతో నారా లోకేశ్ విజృంభించారు. కార్యకర్తలకు, నాయకులకు ఆయన ధైర్యం చెప్పారు. ప్రజలు ఎవరికి ఓటు వేసినా సరే.. నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని అంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అదైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది.. అంటూ ఎన్నికల ప్రచార సమయంలో లోకేశ్ ప్రజలతో కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఇంకా చాలా ట్వీట్లు చేశారు లోకేశ్. అవేంటో మీరే చదవండి..

Read more RELATED
Recommended to you

Latest news