రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం.. అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన నారా లోకేశ్

-

ఇప్పుడే కాదు.. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్ ను అదే ట్విట్టర్ లో రోజూ విమర్శిస్తున్నారు.

నారా లోకేశ్ బాబు గురించి మీకు తెలిసిందే కదా. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లోనే మాట్లాడుతుంటారు. బయట మైకుల ముందు ఆయన మాట్లాడటం చాలా తక్కువ. ఆయన మైకుల్లో మాట్లాడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎందుకంటే.. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తర్వాత మళ్లీ ఆయన మాటల మీద ట్రోలింగ్, కౌంటర్లు.. ఇవన్నీ ఎందుకనే ఆయన ట్విట్టర్ నే నమ్ముకున్నారు.

ఇప్పుడే కాదు.. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్ ను అదే ట్విట్టర్ లో రోజూ విమర్శిస్తున్నారు.

అయితే.. ఇవాళ ఒక అడుగు ముందుకేసి… రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు లోకేశ్.

వైఎస్ జగన్ గారూ… పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం.. అంటూ ఆ వీడియోను షేర్ చేశారు లోకేశ్.

మరోవైపు ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలను కలిసి వాళ్లకు లోకేశ్ భరోసానిచ్చారు. పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై వాళ్లతో చర్చించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని.. ఎవ్వరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news