కోనసీమలో పవన్ ఎఫెక్ట్..జనసేనకు ఆధిక్యం.!

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఉమ్మడి గోదావరి జిల్లాలు చుట్టేసిన విషయం తెలిసిందే. ప్రత్తిపాడు టూ భీమవరం వరకు పవన్ టూర్ కొనసాగింది. పవన్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది. ఇక యాత్రలో జగన్ ప్రభుత్వం టార్గెట్ గా పవన్ విరుచుకుపడ్డారు. అలాగే జనసేనని బలోపేతం చేసే దిశగా ఆయా వర్గాల ప్రజలతో భేటీ అయ్యి, వారి సమస్యలు తెలుసుకుని, వారి మద్ధతు పొందే ప్రయత్నాలు చేశారు.

ఇలా అనూహ్యంగా పవన్ జనసేన బలం పెంచుకుంటూ వచ్చారు. అయితే పవన్ ప్రభావం పర్యటించిన ప్రతి నియోజకవర్గంపై పడినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో పవన్ ప్రభావం ఎక్కువ కనిపించింది. కాకినాడ జిల్లాలో కూడా భారీగానే స్పందన వచ్చింది..గాని..కోనసీమలో ఊహించని మద్ధతు లభించింది. అయితే రాజకీయంగా అక్కడ జనసేనకు పెద్ద ప్లస్ కానుందని తెలుస్తుంది. కోనసీమలో అనూహ్యంగా జనసేన ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కోనసీమలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం, మండపేట, రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట సీట్లు ఉన్నాయి. పవన్ పర్యటన…మండపేట, కొత్తపేట, రామచంద్రపురం మినహా మిగిలిన సీట్లల్లో కొనసాగింది. ఇక ఆయా సీట్లలో జనసేనకు మద్ధతు పెరిగింది. తాజా సర్వేల ప్రకారం..జనసేన..రాజోలు, అమలాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇటు పి.గన్నవరం, ముమ్మిడివరంల్లో భారీగా ఓట్లు సాధించే అవకాశం ఉంది.

అయితే పొత్తులు లేకుండానే జనసేనకి ఆధిక్యం కనిపిస్తుంది. ఇక టి‌డి‌పితో పొత్తు ఉంటే కోనసీమ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. టి‌డి‌పి-జనసేన పొత్తు సక్సెస్ అయితే వైసీపీకి ఒక్క సీటు కూడా రావడం కష్టమనే చెప్పవచ్చు. ఏదేమైనా కోనసీమలో పవన్ ప్రభావం ఎక్కువగానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news