జగన్ కు ఎమ్మెల్యే థాంక్స్…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా సరే చాలా వరకు ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తున్నారు. దళితులకు ఎక్కువగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. తాజాగా దీనిపై పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి ప్రకటించిన జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాస్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు.

గిరిజన, దళిత బిడ్డలు వీటిని సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం జగన్ కృషి చేస్తున్నారు అని అన్నారు. ఇంత మంచి పధకాన్ని ప్రవేశ పెట్టినందుకు జగన్ కి కృతజ్ఞతలు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయంలోగా పూర్తి చేస్తాం అని ఆయన స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news