వైఎస్సార్సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై లాలూ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

-

rabri devi Fire On prashant kishor
rabri devi Fire On prashant kishor

గత రెండేళ్లుగా వైఎస్సార్సీపీ గెలుపు కోసం పని చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీ పార్టీని జేడీయూలో విలీనం చేయాలంటూ ప్రతిపాదించారంటూ ఆమె తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జేడీయూ, ఆర్జేడీ పార్టీలు కలిసి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని.. లోక్ సభ ఎన్నికల ముందే ప్రధాని అభ్యర్థని మనం ప్రకటించాలంటూ కిశోర్ తనకు సూచించారంటూ ఆమె ఆరోపించారు.



అయితే.. ఇదివరకు నితీశ్ కుమార్ చేసిన నమ్మకద్రోహాన్నే తాను ఇప్పటి వరకు మరిచిపోలేదని.. ఆయనపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని.. అందుకే ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. అయితే.. ఆమె వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news