టార్గెట్ కొడాలి-వంశీ: ప్లాన్ మారుస్తున్నారా?

-

తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదిగి…ఇప్పుడు అదే పార్టీకి చుక్కలు చూపిస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే కొడాలి నాని, వల్లభనేని వంశీలు అని చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. వైసీపీలో కీలకంగా ఈ ఇద్దరు నేతలు…చంద్రబాబుని ఓ రేంజ్‌లో తిడుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉండగా కూడా వీరు ఫైర్ బ్రాండ్ నేతలుగానే ఉండేవారు…కానీ ఒక పద్ధతిగా ఫైర్ అయ్యేవారు. ఇప్పుడు అలా కాదు ఎడాపెడా మాటల తూటాలు పేలుస్తున్నారు. చంద్రబాబుపై దారుణమైన విమర్శలు చేస్తూ, పరువు తీసేస్తున్నారు.

ఇటీవల భువనేశ్వరి ఇష్యూలో కూడా ఈ ఇద్దరు నేతలే హైలైట్ అయిన విషయం తెలిసిందే. ఇలా చంద్రబాబుపై విరుచుకుపడుతున్న ఈ ఇద్దరు నాయకులతో మాటలతో కంటే రాజకీయంగానే చెక్ పెట్టాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. కొడాలి నాని టీడీపీలోనే రాజకీయంగా ఎదిగిన విషయం తెలిసిందే. గుడివాడ నుంచి టీడీపీ తరుపున రెండుసార్లు గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు.

అసలు గుడివాడలో టీడీపీ అడ్రెస్ గల్లంతు చేసే పరిస్తితి తెచ్చారు. గత రెండు పర్యాయాలు టీడీపీ అభ్యర్ధులని మార్చిన ప్రయోజనం లేకుండా పోయింది. నాని వరుసగా గెలుస్తూనే వచ్చారు. పైగా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఇక చంద్రబాబుపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు. అయితే ఇలా టీడీపీకి కొరకరాని కొయ్య మాదిరిగా తయారైన నానికి చెక్ పెట్టడానికి ఈ సారి గుడివాడ బరిలో వంగవీటి రాధాని బరిలో దింపడానికి టీడీపీ సిద్ధమైనట్లు కథనాలు వస్తున్న విషయం తెలిసిందే.

అటు గన్నవరం నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ నుంచి గెలిచిన వంశీ…వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈయన చంద్రబాబుని ఎన్నిరకాలుగా తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఈయనకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం గన్నవరంలో టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నారు. వంశీకి చెక్ పెట్టే బలం బచ్చులకు లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో వంశీపై గద్దె అనురాధాని బరిలో దింపే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఈ ఇద్దరికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఉంది. మరి టీడీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news