అధికారులకు టీడీపీ సీనియర్ వార్నింగ్…!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికారుల తీరుపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వారి టార్గెట్ గా ఘాటు విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేసారు. ప్రభుత్వ అధికారులారా! అధికార పరిధి దాటి వ్యవహరించకండి అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీరే ప్రభుత్వాలకు శాశ్వతం అని ఆయన అన్నారు.

varlaramaiah questions ys jagan on viveka murder case
varlaramaiah questions ys jagan on viveka murder case

పరిధి దాటి ప్రవర్తించిన అధికారులకు భంగపాటు తప్పదు అని ఆయన కీలక వ్యాఖ్య చేసారు. అంతే కాకుండా… పరిధి దాటి గతంలో జైలు జీవితం గడిపిన పెద్ద పెద్ద అధికారులు కూడ మనకు తెలుసు అంటూ కొందరిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. పరిధి దాటకండని అన్నారు. బాధ పడకండని… కొందరి తీరుపైనే బాధ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news