బ్రేకింగ్; యువ నాయకుడు అవినాష్ ఆత్మహత్యాయత్నం…!

-

టీడీపీ యువనేత ఆత్మహత్యాత్నం చేసారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ తనయుడు అవినాష్ పోలీస్ స్టేషన్ భవనం పై దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి ప్రభుత్వం నుంచి వేధింపులు బాగా పెరిగాయని, ఎక్కడ గొడవ జరిగినా సరే అవినాష్ ని బాధ్యుడని చేస్తూ పోలీసులు కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని, అవినాష్ గతంలో ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అవినాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు టీడీపీ నేతలు. దీనితో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు టీడీపీ నేతలు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news