తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష: నిరంజన్ రెడ్డి

-

తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు ప్రాజెక్ట్ లపై అవగాహన గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ మీదపైడి బీజేపీ పడి ఏడుస్తుందని విమర్శించారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ వడ్డు కొనుగోలు చేయాలని, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, రాష్ట్రానికి నిధులు రావాలని, క్రిష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీలు తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదని యాత్రలు చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. బండి సంజయ్ యాత్ర వల్ల ఒరిగిందేం లేని ఆయన అన్నారు. దేశాన్ని ఏలే బీజేపీ పార్టీ, మోదీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా మేలు చేసిందేం లేదని ఆయన విమర్శించారు. 8 ఏళ్లుగా ఏ ఒక్క పని చేయలేదని ఆయన అన్నారు. అద్భుతమైన రీతిలో అబద్ధాలు చెప్పే ప్రభుత్వంగా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని కీర్తించవచ్చని ఆయన ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మతపరమైన విద్వేశాలను రెచ్చగొడుతున్నారని బీజేపీని విమర్శించారు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చి యాత్రలు చేస్తూ కేసీఆర్ ను తిడుతున్నారని… ప్రధాని మోదీని పళ్లెత్తి మాట అనరని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news