LB నగర్ లో మిస్సింగ్ అయిన వ్యక్తి ఖమ్మం జిల్లా లో హత్య

-

LB నగర్ లో మిస్సింగ్ అయిన వ్యక్తి ఖమ్మం జిల్లాలో హత్య కు గురయ్యాడు. ఖమ్మం జిల్లా లో రఘునాథ పాలెం మండలం వద్ద మూలగూడెం వద్ద సాగార్ లో బాను చందర్ మృతదేహం లభించింది. ఈ నెల 16 న ఇంట్లో నుండి బాను చందర్ బయటకు వెళ్లగా.. 17న lb నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఫిర్యాదు చేసారు ఆయన కుటుంబ సభ్యులు. దింతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. మిస్సింగ్ అయిన రోజు నుండి పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా వెతికారు.

ఈ తరుణంలోనే ఖమ్మం జిల్లాలో మూల గూడెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది.
అనంతరం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురిలో 3 రోజుల పాటు ఉంది బాను చందర్ మృతదేహం. ఖమ్మం పోలీసుల ఇచ్చిన వివరాల మేరకు ఖమ్మం వెళ్లిన lb నగర్ పోలీసులు.. బాను చందర్ మృతదేహానికి ఉన్న చేతి ఉంగరం ద్వారా గుర్తు పట్టారు. 2 నెలల క్రితమే బాను చందర్ కు వివాహం జరిగింది…కాలనీ లో ఉన్న లోకల్ లీడర్స్ హత్య చేశారు అని కుటుంబ సభ్యుల ఆరోపణలు చేస్తున్నారు.

చందు నాయక్(CPI అధ్యక్షుడు, సాయి నగర్ నాగోల్),సుధాకర్, రాయుడు,పాషా ,మున్న సైదా బేగం,యాదగిరి వీళ్ళు హత్య చేసి ఉంటారు అని భావిస్తున్నారు కుటుంబ సభ్యులు.. చందు నాయక్ అనే వ్యక్తి కాళీగా ఉన్న గుడిసెలను అమ్ముతూ ఉంటాడని.. ఆ విషయం పై పలు సార్లు మా అన్నా అడిగాడు…ఇలా పలు విషయాలపై మా అన్నా ను ఇబ్బందులు పెట్టె వారు.మాకు న్యాయం జరగాలి.. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news