టీడీపీకి మరో దెబ్బ.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా.. కారణం ఇదేనా?

-

టీడీపీకి చెందిన మరో 16 మంది ఎమ్మెల్యేలంతా కట్టకట్టుకొని బీజేపీలో చేరుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి గంటాతో సహా.. 15 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు దానికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఇతర నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా టీడీపీకి మరో ముగ్గురు ముఖ్య నేతలు షాక్ ఇవ్వనున్నారట. కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ముగ్గురు ముఖ్యమైన ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారట. రాజీనామా చేసి వాళ్లు వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు సమాచారం.

అయితే.. ఆ ముగ్గురు డైరెక్ట్ గా వైసీపీలో చేరరట. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి.. ఆ తర్వాత మళ్లీ వైసీపీ నుంచి బీఫామ్ తీసుకొని గెలిచి వైఎస్సార్సీపీలో చేరుతారట. ముఖ్యమంత్రి జగన్ కూడా ఫిరాయింపులను ప్రోత్సహించేది లేదని ఖరాఖండీగా చెప్పేశారు. అందుకే.. వాళ్లను గెలిపించే బాధ్యతను కూడా వైఎస్సార్సీపీ హైకమాండ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు అనేది మాత్రం తెలియలేదు.

అంతే కాదు.. టీడీపీకి చెందిన మరో 16 మంది ఎమ్మెల్యేలంతా కట్టకట్టుకొని బీజేపీలో చేరుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మాజీ మంత్రి గంటాతో సహా.. 15 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు దానికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news