నాలుగ‌న్న‌రేళ్ల‌లో 5 ల‌క్ష‌ల కోట్లు చంద్ర‌బాబు దోచేశారు : విజ‌య‌సాయిరెడ్డి

-

Vijaya Sai Reddy Fire On Chandrababu Naidu
అమ‌రావ‌తి(ఏలూరు): ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యలను గాలికొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో దాదాపు రూ. 5 లక్షల కోట్లను విదేశాలకు తరలించారని ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన విజయసాయిరెడ్డి.. చంద‍్రబాబు పాలన అంతా అవినీతి మయంగా తయారైందన్నారు. ప్రధానంగా పశ్చిమలో 15 అసెంబ్లీ సీట్లను ప్రజలు ఇస్తే.. అసలు జిల్లాకు ఏం చేశారని ప్రశ్నించారు.

అన్ని సీట్లు ఇస్తే రౌడీ ఇజాన్ని, ఇసుకదందాని టీడీపీ ఎమ్మెల్యేలతో చేయిస్తున్నారన్నారు. ద్వారకాతిరుమల వెంకన్నసాక్షిగా చంద్రబాబు ప్రమాణం చేసి పశ్చిమకు ఎంత న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొల్లేరు విషయంలో స్వార్థ ప్రయోజనాలే తప్ప ప్రజల కోసం మాత్రం ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ’నాలుగున్నరేళ్ళల్లో సుమారు రూ. 5 లక్షల కోట్లు విదేశాలకి తరలించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తాం’ అని విజయసాయి రెడ్డి విమర్శించారు.ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతోనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను చేపట్టారన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అధికారంలోకి రాగానే సుపరిపాలనే అందించాలనేది తమ పార్టీ ఉద్దేశమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news