మరీ దారుణంగా తిట్టుకుంటున్న వైసీపీ, బిజెపి…!

-

ఆంధ్రప్రదేశ్ లో బిజెపి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చంద్రబాబు నాయుడు కి అమ్ముడు పోయారని… వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. సుజనా చౌదరి ఈ డీల్ చేసారని ఆయన ఆరోపించారు. దీనిపై విజయసాయి రెడ్డికి ఏపీ బిజెపి కౌంటర్ ఇచ్చింది. చీకట్లో చిల్లర లెక్కలు అంటూ ఆరోపించింది. సూట్ కేస్ రెడ్డి , బహుకాలపు జైలు పక్షివి.. రాజకీయాల్లో అక్కుపక్షివి..

వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి.. ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి.. మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే.. మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి. పాపం పండే టైం వచ్చేసింది. అని కౌంటర్ ఇచ్చింది ఏపీ బిజెపి. విజయసాయి రెడ్డిపై గత కొన్ని రోజులుగా కన్నా లక్ష్మీ నారాయణ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. “కరోనా కిట్ల”లో కూడా కమీషన్ కొట్టారా?

మన పక్కరాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనాకిట్లను దక్షిణకొరియా నుండి కేవలం ₹337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారు? ఈ రెండు కిట్లరేట్లలో తేడాని ప్రజలకు చెప్పి ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవాలి. అని కన్నా వ్యాఖ్యానించారు. దీనితో విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news