ఈనెల 3 వ‌ర‌కు శ్రీ‌నివాస్ రిమాండ్ పొడిగింపు

-

YS Jagan Attack Accused Srinivas Rao Remand Extend అమ‌రావ‌తి: వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 3వరకు రిమాండ్ పొడిగించింది. శుక్రవారంతో శ్రీనివాస్‌ రిమాండ్ ముగియడంతో పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి శ్రీనివాస్‌ రిమాండ్‌ పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news