ఎడిట్ నోట్ : వైసీపీకి కొత్తా దేవుడాండి !

-

ఫ‌స్ట్ కాజ్ : రానున్న ఎన్నిక‌ల్లో కొత్త వ్యూహ‌క‌ర్త‌తో ప‌నిచేసేందుకు వైసీపీ చీఫ్ జ‌గ‌న్ స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఇదే ఐ ప్యాక్ బృందంలో కొంద‌రు అటు తెలంగాణ‌లో వైఎస్ఆర్టీపీకీ సాయం అందించ‌నున్నారు అని తెలుస్తోంది.

ఎన్నిక‌లు ఎప్పుడు వచ్చినా ఈ సారి కూడా కార్పొరేట్ పాలిటిక్స్ మాత్ర‌మే కీల‌కం కానున్నాయి. కొన్ని రాజ‌కీయ శ‌క్తుల ఎదుగుద‌ల‌కు అవే బ‌లం అందించ‌నున్నాయి. తెర వెనుక ఉండి రాజ‌కీయం చేయ‌నున్నాయి. దేశంలో జాతీయ పార్టీల‌ను న‌డిపే విధంగానే, రాష్ట్రాల‌లో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలకు అవి నిండుగా, మెండుగా అండ‌దండ‌లు ఇచ్చే అవ‌కాశాలున్నాయి. ఎవ‌రి అవ‌కాశాలు ఎలా ఉన్నా.. ఈ సారి టీడీపీ క‌న్నా వేగంగానే వైసీపీ వ్యూహ‌క‌ర్త‌ల నియామ‌కంలో ముఖ్యంగా కార్పొరేట్ లాబీయింగ్-లో ముందుంద‌ని కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆ విధంగా ఓ రాజ‌కీయ పార్టీ ఎదుగుద‌ల అన్న‌ది అటు కార్పొరేట్ కంపెనీల పైనా అదేవిధంగా  కొన్ని మీడియా శ‌క్తుల పైనా, కొంత మేర విదేశీ నిధుల‌ పైనా ఆధార‌ప‌డి గ‌తంలోనూ రాజ‌కీయాలు న‌డిచేయి. కాంగ్రెస్ మార్కు రాజ‌కీయం అంతా ఒక‌ప్పుడు ఈ విధంగానే ఉండేది. తాజాగా వైసీపీ మ‌రీ ఇంత‌లా కాక‌పోయినా, వీలున్నంత మేర‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీల నిలువ‌రింతకు కార్పొరేట్ శ‌క్తుల సాయం  పొందాల‌నే భావిస్తున్నది అని తెలుస్తోంది.

ఒక్క వైసీపీ అనేకాదు తెలుగుదేశం,టీఆర్ఎస్,డీఎంకే లాంటి ప్రాంతీయ పార్టీల‌కూ, బీజేపీ లాంటి జాతీయ పార్టీల‌కూ ఇవాళ కార్పొరేట్ లాబీయింగ్ తో పాటు వ్యూహ‌క‌ర్త‌లు, పొలిటిక‌ల్ ఏజెన్సీలు కూడా త‌ప్ప‌నిస‌రి ! వీటిని దృష్టిలో ఉంచుకునే ప్ర‌శాంత్ కిశోర్ లాంటి త‌మ‌దైన చ‌క్రం తిప్పేందుకు  ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఇదేం త‌ప్పు కాక‌పోయినా, ఇటువంటి స్ట్రాట‌జిస్టుల అతి చొర‌వ కార‌ణంగా రాష్ట్రాల ఎదుగుద‌లకు కొన్ని నిర్ణ‌యాలు మాత్ర‌మే ప్ర‌తిబంధ‌కం అవుతున్నాయి.
ఆంధ్రావ‌నిలో వైసీపీ రాజ‌కీయం అంతా డిఫ‌రెంట్. పాలిటిక్స్-కు, కార్పొరేట్ కల్చ‌ర్-ను జ‌త చేసిన ప‌ద్ధ‌తి ఒక‌టి గతంలోనే హిట్  అయింది. ఇప్పుడ‌దే హిట్ ఫార్ములాను తీసుకుని జ‌గ‌న్ మళ్లీ ఎన్నిక‌ల యుద్ధం చేయ‌నున్నారు.  గ‌తంలో ప‌నిచేసిన విధంగానే ఇప్పుడు కూడా అదే ప‌ద్ధ‌తిలో పార్టీకో దిశ‌ను నిర్దేశం చేయ‌నున్నారు కొంద‌రు. గ‌తంలో మాదిరిగానే క్షేత్ర స్థాయి వాస్త‌వాలు జ‌గ‌న్-కు చేర‌వేయ‌నున్నారు.

ఇదే ఐ ప్యాక్ లో కొంద‌రు విడిపోయి టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీల‌కూ సాయం చేసిన దాఖ‌లాలు ఉన్నాయి. కానీ అవేవీ పూర్తి స్థాయిలో లేవు. కొన్ని నెల‌ల వ‌రకూ ప‌నిచేసి తరువాత వాళ్ల‌తో ప్యాక్ అప్ చెప్పించేశారు. సునీల్ అనే ఐ ప్యాక్ మెంబ‌ర్ టీడీపీకి  ఆ మధ్య కొంత కాలం ప‌నిచేసి, త‌రువాత త‌ప్పుకున్నారు. కానీ వైసీపీ మాత్రం ముందు ప్ర‌శాంత్ కిశోర్ టీం ను వ‌ద్ద‌నుకున్నా ఎందుక‌నో వాళ్ల‌నే ఎంచుకుని రాజ‌కీయం చేసేందుకు స‌మాయ‌త్తం అవుతోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల కోసం వైసీపీ ఇప్ప‌టి నుంచి వ్యూహ‌క‌ర్త‌ల‌ను రంగంలోకి దింపుతోంది. పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసేందుకు, పార్టీకి సంబంధించిన అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల‌ను తేల్చేందుకు వైసీపీ త‌ర‌ఫున ఓ టీం కృషి చేయ‌నుంది.  ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ క్లుప్తంగా ఐ ప్యాక్ పేరిట ప్రశాంత్ కిశోర్ మ‌నుషులే జ‌గ‌న్ త‌ర‌ఫున ప‌నిచేయ‌నున్నారు. ఈ మేరకు రంగంలోకి రేప‌టి నుంచి కొత్త వ్య‌క్తి ఒక‌రు దిగ‌నున్నారు. ఆయ‌న పేరు రిషి రాజ్ సింగ్. రేప‌టి నుంచి ఆయ‌న పార్టీ త‌ర‌ఫున వ‌ర్క్స్ మొద‌లుపెడ‌తారు.

Read more RELATED
Recommended to you

Latest news