పొన్నం: గతంలో ఆలయాలు లేవా..? బండి సంజయ్ గ్రామాల్లోకి వచ్చారా..?

-

కాంగ్రెస్ వచ్చిందంటే హనుమాన్ చాలీసా చదవనికోమని అంటున్నారు. మన ఆస్తులు ముస్లింలకు ఇస్తామని అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గతంలో హనుమాన్ టెంపుల్స్ లేవా..? హనుమాన్ చాలీసా చదవలేదా అని అడిగారు. బండి సంజయ్ ఎప్పుడైనా గ్రామాల్లోకి వచ్చి పర్యటించారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికరమైన పోస్టు చేశారు.

పదేళ్లలో ఎంతమంది హిందువులకి న్యాయం చేసావు సంపద అంతా ఆదానీ అంబానీలకి పంచిపెట్టారన్నారు. నిన్న గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి సూరత్ ఇప్పటికే గెలిపించుకున్నామంటున్నారని బెదిరించి గెలుచుకోవడం కాదు. ఓట్లతో గెలుచుకో అని మండిపడ్డారు. ఇంకో పక్క భవిష్యత్తులో రైతులకి సాగునీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు తెస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version