చిరంజీవి జనసేనకి విరాళం ఇవ్వడంపై పోసాని రియాక్షన్ ఇదే!

-

చిరంజీవి జనసేనకి విరాళం ఇవ్వడంపై ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని మురళీకృష్ణ స్పందించారు.బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..తమ్ముడు మంచి వాడు అనుకునే చిరంజీవి విరాళం ఇచ్చాడు..చిరంజీవి విరాళం ఇచ్చే లోపు జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది అని అన్నారు. మహిళా వాలంటీర్ లను నీచంగా అవమానించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వాలంటీర్లు పై పవన్ చేసిన వ్యాఖ్యలకు అయన సిగ్గుపడాలి..2 లక్షల పుస్తకాలు చదివాను అంటావు ఇదేనా..?పవన్ కళ్యాణ్ మానసిక రోగి.. ఉన్మాది లా తయారయ్యాడు.. అని విమర్శించారు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి భారీ విరాళం ఇచ్చారు. పోచంపల్లిలో విశ్వంభర మూవీ షూటింగ్ సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కి రూ.5 కోట్ల చెక్కు అందజేశారు.దీంతో జనసేన పార్టీ ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news