స్పిరిట్ లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఓ రేంజ్ లో..!!

-

తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమా ద్వారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇక దీని తర్వాత ఈ సినిమా ను బాలీవుడ్ లో కూడా తీసి సూపర్ హిట్ గా మలిచాడు. దీనితో సందీప్ తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ తో పాటు టోటల్ బాలీవుడ్  లో ఆసక్తి పెరిగింది. తన టేకింగ్ మరియు దర్శకత్వ ప్రతిభకు అందరూ సలాం కొడుతున్నారు.

ప్రస్తుతం సందీప్.. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.న్యూ ఇయర్ కానుకగా యానిమల్ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పిల్లలు దడుసుకొనేల క్రూరంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో రణబీర్ కపూర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాడు. ఈ లుక్ చూస్తే సందీప్  రెడ్డి మరో ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా క్రియేట్ కోసం చూస్తున్నాడని తెలుస్తోంది. బాడీ మొత్తం రక్తంతో తడిచి, చంకలో గొడ్డలి పెట్టుకుని సిగరెట్ కాల్చుతూ రణబీర్ ఓ రేంజ్ లో ఉన్నాడు. ఈ సినిమా లుక్ చూసి అందరి మతులు పోయాయి.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.ఈ మేరకు ‘స్పిరిట్’ చిత్రం పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారంట.ఇక ఈ చిత్రంతో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. సినిమా పోలీస్ డ్రామాగా తెరకెక్కనుందని, ప్రభాస్ ను ఫ్యాన్స్ మునుపెన్నడూ చూడని విధంగా చూపిస్తారని బాలీవుడ్ నుండి లీకులు అందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news