రాంచరణ్‌‌తో ప్రశాంత్ నీల్ సినిమా.. ఎప్పుడు స్టార్ట్ అంటే?

-

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ సినిమాల విషయంలో జోరు పెంచాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమాను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఆయన లిస్టులోకి కొత్తగా మరో ప్రాజెక్ట్‌ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’ వంటి పాన్ ఇండియా మూవీస్ తీసిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌‌తో ఓ మూవీ కమిట్ అయినట్లు ఫిలిం ఇండస్ట్రీలో టాక్.

స్టోరీకి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం.అయితే, ఈ ప్రాజెక్ట్‌ను డీవీవీ దానయ్య నిర్మించనున్నారని టాక్ వినిపిస్తోంది.ప్రశాంత్ నీల్ ‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అది అయ్యాక ‘సలార్‌ 2’, ‘కేజీఎఫ్‌ 3’ పూర్తి చేస్తాడని తెలుస్తోంది.అవి పూర్తయ్యాకే చెర్రీతో కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈలోపు రాంచరణ్ బుచ్చిబాబు, సుకుమార్‌ల‌తో సినిమాలను ఫినిష్ చేస్తాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version